Chittoor లో ఘోరం.. ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు మృతి, 22 మందికి గాయాలు

by Dishafeatures2 |
Chittoor లో ఘోరం.. ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు మృతి, 22 మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలోని పూతలపట్టులో బుధవారం రాత్రి ఘోరం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పూతలపట్టు మండలంలోని జెట్టిపల్లి గ్రామంలో పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు ఐరాల మండలం బలిజపల్లి గ్రామం నుంచి దాదాపు 30 మంది ట్రాక్టర్ లో బయలుదేరారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ పూతలపట్టు మండలంలోని లక్ష్యయ్య ఊరు చేరుకోగానే ఓవర్ స్పీడ్ వల్ల అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సురేంద్ర రెడ్డి (52), వసంతమ్మ (50), రెడ్డమ్మ (31), తేజ (25), వినీశ (3), దేసిక (2) అక్కడికక్కడే మృతి చెందారు. 22 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read....

అప్పు తీర్చలేదని మహిళను నరికిన వ్యక్తులు..



Next Story

Most Viewed